ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 7:06 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జైపూర్‌లో ప్రజావాణి.. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల ఆదేశాలు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక దృష్టి

జైపూర్‌లో ప్రజావాణి.. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారుల ఆదేశాలు.ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల ప్రత్యేక దృష్టి.

అర్జున్ సమాచారం. ఆగస్టు 31. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్, ఆగస్టు 31: జైపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా మొత్తం రెండు ఫిర్యాదులు అందగా, రెండు ఫిర్యాదులు రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రజావాణిలో సమర్పించి పరిష్కారం పొందాలని కోరారు.
హాజరైన అధికారులుమండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపురావు, మండల ఉప తహసీల్దార్ జే. సంతోష్‌కుమార్, మండల వ్యవసాయ అధికారి సైదా, వైద్యాధికారి డాక్టర్ ముస్తఫా, జైపూర్ ఎస్సై వి. రామలక్ష్మి, పశువైద్య సహాయ శస్త్రచికిత్సాధికారి డాక్టర్ ఏ. వెంకటేష్, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్ బి. రాజ్‌కుమార్, గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీర్ కాంక్ష, గ్రామీణ నీటి సరఫరా శాఖ సహాయ ఇంజినీర్ ఎన్. రాజమలయ్య, మండల ఉద్యానవన అధికారి ఎం. కళ్యాణి, సమగ్ర శిశు అభివృద్ధి పథకం పర్యవేక్షకురాలు గాయత్రి, గ్రామీణాభివృద్ధి సహాయ ప్రాజెక్టు అధికారి జి. బి. బాలయ్య, ఐకేపీ సహాయ ప్రాజెక్టు అధికారి సిహెచ్. సంతోష్, అటవీ శాఖ బీట్ అధికారి పి. వసంతలక్ష్మి, వృత్తి పన్నుల శాఖ, ఆబ్కారీ శాఖ పరిశీలకుడు బి. శంకర్, మండల వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఈ. సుధాలక్ష్మి పాల్గొన్నారు.